Monday, 8 August 2016

దేవుని సంగతులను సాతాను ఎలా వక్రీకరిస్తాడు ?

సాతాను ఒక అబద్ధికుడు.  (యోహాను  8:44), మరియు మోసగాడు  (ప్రకటన  20:7-8,10). వాడు ఎన్నుకొనే మార్గాలు ఎలాంటివంటే  దేవునికి సంబందించిన మంచి సంగతులను నకిలీవిగా  తయారుచేసి,  ఏవి దేవునివో  ఏవి సాతానువో  కనుగొనలేనంతగా ప్రజలను పిచ్చివాళ్లను  చేస్తాడు.  
     సాతాను చేసే నకిలీవి ఏంటి? 

దేవుడు తన మాటలను ప్రకటించడానికి ప్రవక్తలను పంపితే , సాతాను కూడా అబద్ద ప్రవక్తలను పంపుతాడు.  (1 యోయాను  4:1)(మత్తయి  24:11,24)(మత్తయి  7:15-16).
దేవుడు తన వాక్యాన్ని ప్రకటించడానికి బోధకులను ఇస్తే సాతాను అబద్ద బోధకులను ఇస్తాడు.               (2 పేతురు  2:1-3)(1 తిమోతి  4:1-3)(2 యోహాను  1:9-11)(మలాకి  2:8-9)(గలతి  1:6-9).
యేసు లోకానికి వెలుగైతే  (యోహాను  1:7-9)(యోహాను 8:12)(లూకా  2:32)(యోహాను 12:35-36),   వాడు వెలుగు దూత వలే వేషం వేస్తున్నాడు.   (1 పేతురు  5:8).
దేవుడు త్రిత్వం అయితే సాతాను కూడా "అపవిత్ర మైన త్రిత్వం ,    (ప్రకటన  16:13).
సాతాను దేవుని మాటలను అర్ధం మార్చి తన దురుద్దేశం నెరవేర్చుకోవడానికి వాడుకుంటాడు. (మత్తయి 4:1-11).
దేవుడు సంఘానికి ఇచ్చిన తలాంతులు దుర్వినియోగపరిచి ప్రజలలో కలవరం తీసుకొస్తాడు. ఉదా: భాషలు, ప్రవచనాలు .
యేసుక్రీస్తు వారు "యూదా సింహం" (ప్రకటన  5:5) గ వర్ణించబడితే సాతాను తనను తానూ గర్జించే సింహంగా" పోల్చుకున్నాడు. (1 పేతురు  5:8).

     ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.  కాబట్టి ఏది దేవుని సంబందించినది ఏది నకిలీది అనేది మనం ఎలా గుర్తుపట్టేది?కాబట్టి మనం వాక్యాన్ని బాగా చదివాలి, ధ్యానించాలి. బాగా ప్రార్థనలో గడపాలి. అప్పుడే మనం గమనించగలం.  





No comments:

Post a Comment